చిరంజీవి, శ్రీదేవి కలిసి ‘అందాలలో మహోదయం’ పాటచిరంజీవి, శ్రీదేవి కలిసి ‘అందాలలో మహోదయం’ పాటలో పరవశంగా కనిపిస్తున్న సన్నివేశం

‘అందాలలో మహోదయం’ – నాటి మాయాజాలం నేటికీ హిట్

1980ల చివరి నుంచీ 1990ల మధ్యకాలం తెలుగులో ఫాంటసీ సినిమాలకు స్వర్ణయుగంగా నిలిచింది. అందులోనూ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ (1990) ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమా ఇప్పుడు 35 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఇందులోని పాటలు మరోసారి సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా ‘అందాలలో మహోదయం’ పాట మళ్లీ వైరల్ అవుతోంది.

చిరంజీవి–శ్రీదేవి స్క్రీన్ మ్యాజిక్

ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి కలిసి స్క్రీన్ మీద ఎమోషనల్ కనెక్ట్ ను అందించారు. కథ ప్రకారం, దేవకన్య అయిన శ్రీదేవి భూమ్మీదకు విచ్చేస్తుంది. మానవుడైన చిరంజీవితో తారసపడుతుంది. ఈ సందర్భంలోనే ప్రకృతి మధ్యలో ఇద్దరూ పాడుకునే పాటే – అందాలలో మహోదయం.

వేటూరి సాహిత్యం, ఇళయరాజా సంగీతం

ఈ పాటకు వేటూరి అందించిన సాహిత్యం ప్రతిక్షణానికీ అర్థవంతంగా ఉంటుంది. ఇళయరాజా సంగీతం, బాలు–జానకి గాత్రం పాటను మరింత మధురంగా తీర్చిదిద్దాయి. “నీలాకాశం దిగివచ్చే లోయలో.. ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో” వంటి లైన్లు మనసుని తాకకుండా ఉండవు.

11 రోజుల్లో షూట్ చేసిన సాంగ్

ఈ పాట కోసం స్టూడియోలో ప్రత్యేకంగా భారీ సెట్ నిర్మించారు. రాఘవేంద్రరావు సుదీర్ఘంగా 11 రోజులు ఈ పాటను చిత్రీకరించారు. చిరంజీవి 104 డిగ్రీల జ్వరంలోనూ డ్యాన్స్ చేశారని విశేషం.

సోషల్ మీడియాలో మళ్లీ వైరల్

రిసెంటుగా రీ-రిలీజ్ కావడంతో ఈ పాటకు మరింత క్రేజ్ వచ్చి నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ పాటకు ఫ్యాన్ వీడియోలు, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

క్లాసిక్స్ ఎప్పటికీ చిరస్మరణీయం

ఇలాంటి పాటలు ఒక్కసారి పుట్టి, శాశ్వతంగా నిలిచిపోతాయి. “అందాలలో మహోదయం” పాట సంగీత ప్రియులకు మధురమైన జ్ఞాపకం మాత్రమే కాదు, తెలుగు సినిమా సంగీతానికి ఒక నిధిగా నిలుస్తోంది.

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *