మల్లీశ్వరి 1953 చైనా విడుదల పోస్టర్ఎన్టీఆర్, భానుమతి నటించిన చారిత్రాత్మక చిత్రం ‘మల్లీశ్వరి’ చైనాలో విడుదలైన మొదటి తెలుగు సినిమా పోస్టర్.

చైనాలో విడుదలైన

చైనాలో విడుదలైన తొలి తెలుగు సినిమా ‘మల్లీశ్వరి’

ఈరోజుల్లో ‘పాన్ ఇండియా’ అనే పదం చాలా వినిపిస్తోంది. కానీ తెలుగుసినిమా ఓ పాన్ గ్లోబల్ క్రేజ్‌ని సృష్టించిందని తెలియని వారికోసం – 1951లో విడుదలైన ‘మల్లీశ్వరి’ చిత్రం ఓ చరిత్ర. ఎన్టీఆర్, భానుమతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చారిత్రాత్మక ప్రేమకథా చిత్రం, బీఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. దీన్ని 1952లో పెకింగ్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.

చైనాలో విడుదల & ఘనత

ఫిలిం ఫెస్టివల్‌లో అద్భుత స్పందన తర్వాత ఈ సినిమాను చైనీస్‌లోకి డబ్ చేసి 1953 మార్చి 14న చైనాలో విడుదల చేశారు. ఇది చైనాలో విడుదలైన తొలి తెలుగు సినిమా మాత్రమే కాదు, చైనీస్ భాషలోకి డబ్ చేసిన తొలి తెలుగు సినిమా కూడా. ఈ ఘనత తెలుగు చిత్రసీమకు అపూర్వ గౌరవంగా నిలిచింది.

మల్లీశ్వరి పాటలు, ప్రదర్శన, ఆడియో

‘మల్లీశ్వరి’ చిత్రంలోని పాటలు ఇప్పటికీ కాలాతీతంగా నిలిచాయి. ప్రేమ, చారిత్రక నేపథ్యం, కళాత్మకత అన్నీ కలగలిపిన ఈ చిత్రం, మొదట ప్రదర్శనలో పెద్దగా రాణించకపోయినా, రెండోసారి విడుదల సమయంలో గొప్ప విజయాన్ని సాధించింది. ఎన్టీఆర్ నాగరాజుగా, భానుమతి మల్లీశ్వరిగా చేసిన నటన ఎంతో మెప్పించింది.

ఇప్పుడు మన సినిమాల ఖ్యాతి

‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలు చైనా సహా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించాయి. కానీ, ఈ పాన్ ఇండియా ప్రభంజనానికి పునాది ‘మల్లీశ్వరి’ అనే చెప్పాలి. అంతటి ఘన చరిత్రను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *