తిరుపతి రుయా ఆసుపత్రిలో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు – మదనపల్లె యువకుడికి పాజిటివ్

 

తిరుపతి, వైద్య విభాగం: జిల్లాలో కోవిడ్ మహమ్మారి మళ్లీ కనిపించింది. తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో మదనపల్లెకు చెందిన 25 ఏళ్ల యువకుడు కోవిడ్ అనుమానిత లక్షణాలతో హాజరయ్యాడు. వైద్యులు నిర్వహించిన రాపిడ్ పరీక్షలో పాజిటివ్ గా తేలింది.

తక్షణమే వైద్యుల సూచన మేరకు యువకుడిని హోమ్ ఐసోలేషన్‌కు పంపించారు. ఆయనకు సరైన చికిత్సతో పాటు మందులు అందజేశారు. సమాచారం ప్రకారం, ఈ యువకుడు ఇటీవల కేరళ ప్రయాణం చేసి తిరిగి వచ్చినట్లు తేలింది. వలస ప్రయాణాల కారణంగా కోవిడ్ కేసులు మళ్లీ నమోదు కావచ్చనే ఆందోళన ఏర్పడుతోంది.

ఆరోగ్య శాఖ అధికారులు ఈ కేసుపై గమనించి, అవసరమైన కన్ఫాక్ట్ ట్రేసింగ్‌కి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించడాన్ని, శుభ్రత పాటించడాన్ని మరచిపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

 

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *