కాణిపాకంలో భక్తులపై అధిక ధర వసూలు చేస్తే కఠిన చర్యలు – ఈవో హెచ్చరిక
కాణిపాకం, చిత్తూరు జిల్లా: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని దర్శించేందుకు వచ్చే భక్తులపై అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో వెంకట కిషోర్ హెచ్చరించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు అందిస్తున్న సేవలపై ఆయన అధికారులు, సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు.
ప్రత్యేకంగా భక్తుల పాదరక్షలు, లగేజీలు భద్రపరిచే కేంద్రాలను పరిశీలించి, ఎక్కడైనా అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు తేలితే చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా, నిత్య అన్నదానం కేంద్రాన్ని సందర్శించి, భక్తులకు అందుతున్న భోజన నాణ్యతను సమీక్షించారు. భోజనం గురించి భక్తుల అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ తనిఖీల్లో ఈవో ప్రసాద్ కూడా పాల్గొన్నారు. భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలందించేందుకు చర్యలు తీసుకుంటామని ఈవోలు తెలిపారు.