తిరుపతి వృక్షరహిత నిర్మాణాలు vs పచ్చని యూనివర్సిటీ ప్రాంగణాలు

ఇటు వనం… అటు మనం – తిరుపతిలో పచ్చదనాన్ని నిలుపుదల చేయాల్సిన అవసరం

తిరుపతి, జూన్ 5, 2025: అభివృద్ధి పనులు, భవన నిర్మాణాల పేరిట తిరుపతి నగరంలో పాతవృక్షాలను విస్తృతంగా తొలగిస్తున్న తీరు స్థానికులలో ఆందోళన కలిగిస్తోంది. పర్యావరణంపై దాని ప్రభావం గణనీయంగా పెరిగిందని స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాలు పూర్తిగా వృక్షరహితంగా మారిపోతుండగా, వాతావరణ కాలుష్యం స్థాయిలు పెరుగుతున్నాయి.

అయితే, ఇదే నగరంలోని ఎస్వీ శ్రీపాద మరియు ఎస్వీ వెటర్నరీ విశ్వవిద్యాలయాల ప్రాంగణాలు మాత్రం దశాబ్దాల నాటి పచ్చదనాన్ని, ఆహ్లాదక వాతావరణాన్ని కనబరుస్తున్నాయి. ఇది పర్యావరణ పరిరక్షణకు జీవం పోస్తున్న ఉదాహరణగా నిలుస్తోంది.

ప్రతి వ్యక్తి ఒక మొక్క నాటి, దానిని సంరక్షించాలన్న సంకల్పంతో ముందుకు వచ్చితే నగరానికి మళ్లీ పచ్చదనం చేకూరే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. అభివృద్ధితో పాటు పచ్చదనాన్ని కూడా సమానంగా పరిగణించాల్సిన అవసరం ఉందని ఈ దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి.

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *