కేశవనగర్ మురుగు నీటిOverflow దృశ్యం

సచివాలయం ఎదుట మురుగు ప్రవాహం – కేశవనగర్ వార్డు వాసుల ఆందోళన

తిరుపతి, జూన్ 5, 2025: నగరపాలక సంస్థ పరిధిలోని కేశవనగర్ వార్డు సచివాలయం ఎదుట తీవ్ర అసౌకర్యం నెలకొంది. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా నిర్వహించకపోవడంతో, మురుగు నీరు పొంగిపొర్లి రోడ్డుపైకి చేరుతోంది. దాంతో ఆ ప్రాంతంలో తీవ్ర దుర్వాసన వ్యాపించి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యపై పలు రోజులుగా స్థానికులు సచివాలయ అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజలు ప్రతినిత్యం రావలసిన సచివాలయం వద్దే ఇలాంటి దుస్థితి ఉండడమే స్థానిక పాలనా వ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తోంది.

వర్షాకాలం సత్వరంగా చేరుతుండటంతో, పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉన్నదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు ఈ రహదారిపై నడవలేని పరిస్థితి ఏర్పడినట్లు చెప్పారు. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు పట్టుబడుతున్నారు.

ఇటువంటి విషయాల్లో అధికారుల నిర్లక్ష్య ధోరణి, ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి మురుగు నీటిని శుభ్రపరచడంతో పాటు, భూగర్భ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికుల డిమాండ్.

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *