Air India Boeing 787 Crash Scene in Ahmedabad

అహ్మదాబాద్‌లో భారీ విమాన ప్రమాదం: బోయింగ్ 787 కూలి 254 మంది అపాయంలో

అహ్మదాబాద్‌లో బోయింగ్ 787 ఘోర విమాన ప్రమాదం

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో బోయింగ్ 787 విమానం కూలిపోయింది. గురువారం మధ్యాహ్నం 1:17 గంటల సమయంలో లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా AI171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. ఈ విమానంలో మొత్తం 254 మంది ఉన్నారు – 242 మంది ప్రయాణికులు మరియు 12 మంది సిబ్బంది.

విమానంలో మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లు సమాచారం

ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత విజయ్ రూపానీ కూడా ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. వారి పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రమాదం అనంతరం విమానం జనావాసాలపై పడడంతో చుట్టుపక్కల మంటలు విస్తరించాయి.

ప్రమాద స్థలంలో మంటలు, పొగలు.. సహాయక చర్యలు కొనసాగుతుండగా

విమానం కూలిన వెంటనే ప్రదేశాన్ని దట్టమైన పొగలు మరియు మంటలు కమ్మేశాయి. ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కన్నీటి గదులు, దారుణ దృశ్యాలు అక్కడ కనిపించాయి. పదుల సంఖ్యలో గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించారు.

తీవ్ర ప్రమాదానికి కారణం: అధిక ఇంధనం?

విమానంలో లండన్‌కు వెళ్లేందుకు అధికంగా ఇంధనం నింపడంతో ప్రమాద సమయంలో పెద్ద పేలుడు సంభవించి మంటలు తీవ్రంగా వ్యాపించాయని నిపుణుల అభిప్రాయం. ఈ మంటల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

అధికారుల స్పందన

ప్రమాదం జరిగిన వెంటనే పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్‌కు బయలుదేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్, హోం మంత్రి హర్ష సంగవీ, పోలీస్ కమిషనర్‌లతో మాట్లాడారు. కేంద్రం అన్ని రకాల సహాయాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు.

ఎయిరిండియా అధికారిక ప్రకటన

విమాన AI171 అహ్మదాబాద్ నుంచి లండన్ గ్యాట్‌విక్‌కు బయలుదేరినట్లు ఎయిరిండియా పేర్కొంది. “విమానానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నాం,” అని అధికారికంగా వెల్లడించింది.

DGCA, బోయింగ్ విచారణలోకి

ఈ ప్రమాదానికి గల కారణాలపై DGCA అధికారికంగా దర్యాప్తు ప్రారంభించనుంది. బోయింగ్ కంపెనీ నుంచి కూడా సాంకేతిక బృందం రానున్నట్లు సమాచారం.

 

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *