సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘కూలీ’ సినిమా ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.
భారీ బడ్జెట్తో నిర్మితమైన ఈ మల్టీ స్టారర్ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, సాబిన్ షాహిర్ వంటి పలు భాషల స్టార్ నటులు కలిసి నటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తుండగా, పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్తో ఆకట్టుకోనుంది.
ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నప్పటికీ, తెలుగులో ఈ క్రేజ్ మరింత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా నాగార్జున ఈ చిత్రంలో సైమన్ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రలో ఆయనకి నెగెటివ్ షేడ్స్ ఉండగా, ఫస్ట్ లుక్లో కనిపించిన వింటేజ్ మాస్ లుక్ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది. దీనితోపాటు ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుధ్ అందించడంతో యువతలో క్యూరియాసిటీ పెరిగింది.
అయితే తెలుగు హక్కుల కోసం టాలీవుడ్లో పెద్ద పోటీ నెలకొంది. సితార ఎంటర్టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, ఆసియన్ సంస్థలు వంటి ప్రముఖ నిర్మాతలు ఈ రైట్స్ కోసం బిడ్ చేసినప్పటికీ, చివరికి అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా నాగార్జునే హక్కులను సొంతం చేసుకున్నారు. ఇది సినీ వర్గాల్లో ఓ బిగ్ మూవ్గా మారింది. ఇది కేవలం నటుడిగా కాదు, వ్యాపార వ్యూహాలలోనూ నాగ్ అంతకుమించి ముందే ఉన్నారనే మాటకు మద్దతిస్తోంది.
ఈ సినిమా ఆగస్టు 14న ఇండిపెండెన్స్ డే స్పెషల్గా విడుదల కాబోతోంది. అదే రోజున ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 కూడా విడుదల కానుండటం ఆసక్తికరం. అయితే కూలీ టీజర్కు వచ్చిన రెస్పాన్స్తో పోలిస్తే, వార్ 2 స్పందన అంతగా లేదని టాక్. అందువల్ల బాక్సాఫీస్ పోటీలో కూలీకి మంచి అడ్వాంటేజ్ ఉన్నట్టు కనిపిస్తోంది.