బురదమయమైన పాఠశాల రహదారి – గేవవర్ధనపురం

 వారం క్రితమే వర్షం – ఇప్పుడు రోడ్డే కనిపించదు

గేవవర్ధనపురం మండల కేంద్రానికి కొద్ది దూరంలో ఉన్న ఇందిరానగర్ పంచాయతీ పరిధిలోని ఈ రహదారి, స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలకు వెళ్ళే ప్రధాన మార్గం. వారం క్రితం కురిసిన వర్షానికి ఈ రోడ్డంతా బురదలో మునిగిపోయింది. వర్షం ఆగి వారం అయినా, ఎండలు పెరిగినా రోడ్డు యధావిధిగా బురదగా మిగిలింది.

 విద్యార్థుల కష్టాలు, తల్లిదండ్రుల ఆవేదన

ఈ మార్గంలో నిత్యం చిన్న చిన్న బడి పిల్లలు కాలినడకన పాఠశాలకు వెళ్తున్నారు. బురదలో నడక ప్రమాదకరం కావడంతో పలువురు పిల్లలు జారిపడుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ఆందోళన చెందుతున్నారు.

 కాలువల లేకపోవడం ప్రధాన కారణం

స్థానికుల వాపోతు ప్రకారం, కాన్స్ట్రక్షన్ సమయంలో కాలువలు ఏర్పాటు చేయకపోవడం వల్ల వర్షపు నీరు నిలిచిపోయి రహదారి నాశనమవుతోంది. ప్రతి చిన్న వర్షానికీ రోడ్డును బురదకుప్పగా మార్చే పరిస్థితి దాదాపు ఏడాదిగా కొనసాగుతోంది. పాలకులు స్పందించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *