కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ సెన్సిటివ్ దర్శకుడు శేఖర్ కమ్ముల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘కుబేరా’ సినిమా పై ప్రస్తుతం సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైలో గ్రాండ్గా జరిగింది.
ఈ వేడుకలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ, “ఈ సినిమా ధనుష్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుంది. ఆయన నటన చూసినప్పుడు గర్వంగా అనిపించింది. నిజంగా ఈ పాత్రలో ధనుష్ కాకుండా ఇంకెవ్వరూ నటించలేరు. ఈ సినిమా ద్వారా అతడు మరో జాతీయ అవార్డు ఖచ్చితంగా గెలుస్తాడని నేను నమ్ముతున్నాను,” అంటూ వెల్లడించారు.
ఈ వ్యాఖ్యలతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. ఇప్పటికే రెండు జాతీయ అవార్డులు గెలిచిన ధనుష్, తన నటనతో మూడోసారి కూడా అదే స్ఫూర్తిని చూపించబోతున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాకు సోషియో-పొలిటికల్ థ్రిల్లర్ టచ్ ఉండటంతో, కమ్ముల మాస్ అండ్ క్లాస్ కలయికను చూపించబోతున్నారన్న అంచనాలు ఉన్నాయి.