ఎన్టీఆర్-నీల్ అప్డేట్ పోస్ట్పోన్.. బర్త్డే ట్రీట్కి షాక్ ఇచ్చిన మేకర్స్!
ఫ్యాన్స్కి ఊహించిన డబుల్ ట్రీట్ లేదు!
మే 20 – యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే. అభిమానులకైతే ఇదే నిజమైన పండుగ. ఈ స్పెషల్ రోజున రెండు మేజర్ అప్డేట్లు రాబోతున్నాయని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఒకటి ఎన్టీఆర్-నీల్ సినిమా నుంచి, రెండవది వార్ 2 నుంచి. రెండు అప్డేట్లు ఒకేసారి వస్తే సోషల్ మీడియా, సినిమా ఇండస్ట్రీ మొత్తం హల్చల్ అవుతుందని అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
కానీ… ఊహించని షాక్ ఇచ్చిన మేకర్స్!
ఇప్పుడు అందరి ఆశలపై నీళ్లు చల్లేలా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు మైత్రి మూవీస్ సంయుక్తంగా ఒక ట్వీట్ చేశారు. వార్ 2 అప్డేట్ రాబోతున్నందున, అదే రోజున ఎన్టీఆర్-నీల్ మూవీ అప్డేట్ను విడుదల చేయడం కరెక్ట్ కాదని భావించి, ఆ అప్డేట్ను పోస్ట్పోన్ చేస్తున్నట్టు తెలిపారు.
“వార్ మీద గౌరవంగా మేము మా మాస్ మిస్సైల్ను ఆపేశాం. సరైన సమయానికే దించుతాం.” – అంటూ ట్వీట్ చేశారు.
ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు!
ఈ ప్రకటనతో ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో భయంకరంగా ఫైర్ అవుతున్నారు.
“వార్ 2 వస్తే నీల్ అప్డేట్ ఇవ్వకూడదా?”
“రెండు అప్డేట్లు వస్తే మీకు నష్టం ఏంటి?”
అంటూ నిరాశ, కోపంతో కామెంట్లు చేస్తున్నారు. కనీసం ఓ పోస్టర్ అయినా ఇవ్వండని వేడుకుంటున్నారు.
షూటింగ్ అప్డేట్ ఉన్నా.. గ్లింప్స్ ఏం లేదు
ఇప్పటికే ఎన్టీఆర్-నీల్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయిందని సమాచారం. అందుకే అభిమానులు చిన్న గ్లింప్స్ అయినా వస్తుందని భావించారు. కానీ మేకర్స్ ఈ నిర్ణయంతో వారి ఆశలను చెదగొట్టారు.
కనీసం పోస్టర్ అయినా వస్తుందా?
బర్త్డే రోజున ఎన్టీఆర్కు ట్రిబ్యూట్గా అయినా ఒక పోస్టర్ విడుదల చేస్తారా? లేక మౌనంగా ఉండిపోతారా? అన్నది ఫ్యాన్స్లో ఇప్పుడు హాట్ టాపిక్.