ఇడ్లీ, దోశ అంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి ఫేవరెట్ ఐటెమ్. అయితే ఇవి మరింత ఆరోగ్యకరంగా చేయాలంటే బియ్యం బదులు చిరుధాన్యాలు వినియోగించాలి. ముఖ్యంగా రాగులు, సామలు ఉపయోగించి చేసే ఇడ్లీలు, దోశలు టేస్టీగా ఉండటమే కాదు, ఎముకలకు బలం కూడా ఇస్తాయి. అంతేగాక, ఒకే పిండితో ఇడ్లీ, దోశ రెండూ చేయొచ్చని చెప్పడమే ఈ రిసిపీ స్పెషల్.
కావాల్సిన పదార్థాలు:
-
1 కప్పు రాగులు
-
1/2 కప్పు మినపప్పు
-
3/4 కప్పు సామలు
-
1/4 కప్పు అటుకులు
-
1 టీస్పూన్ మెంతులు
తయారీ విధానం:
ముందుగా అన్నీ పదార్థాలను శుభ్రంగా కడగాలి. అనంతరం 4–5 గంటలు నీటిలో నానబెట్టాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి, ఉప్పు కలిపి రాత్రంతా పులియబెట్టాలి. అటుకులు ఉన్నందున పిండి చక్కగా పులుస్తుంది.
ఇడ్లీ తయారీ:
ఈ పిండిని ఇడ్లీ ప్లేట్స్లో పోసి 10 నిమిషాలు స్టీమ్ చేయాలి. చట్నీతో కలిపి తింటే రుచిగా, ఆరోగ్యంగా ఉంటుంది. అటుకుల వాడకం వల్ల ఇడ్లీలు హోటల్ స్టైల్ మెత్తగా, స్పాంజీగా ఉంటాయి.
దోశ తయారీ:
దోశలు చేయాలంటే పిండిలో కొద్దిగా నీరు కలిపి తక్కువ మిద్దెపై వేయాలి. రెండు వైపులా కాల్చాలి. నెయ్యి లేదా వెన్నతో కాల్చితే రుచిగా ఉంటుంది. టమాటా, అల్లం చట్నీతో తింటే మరింత రుచిగా ఉంటుంది.
ఆరోగ్య ప్రయోజనాలు:
రాగులు కాల్షియం, ఐరన్, ఫైబర్లో సమృద్ధిగా ఉంటాయి. సామలు ప్రొటీన్స్, మినరల్స్ అందిస్తాయి. బియ్యం ఉపయోగించకుండా ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ తయారవుతుంది. ఇది షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ను కూడా కంట్రోల్లో ఉంచుతుంది.
గమనిక:
ఇది ఓ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐడియా మాత్రమే. మీరు దీన్ని పాటించేముందు, మీ ఆరోగ్య స్థితిని బట్టి వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.