శ్రీహరికోట ఇస్రో వేదిక – అభివృద్ధి కార్యక్రమం

ఇస్రో అభివృద్ధికి శ్రీహరికోట కేంద్రం

అంతరిక్ష పరిశోధనలో భారత్‌ మరింత ముందుకు సాగేందుకు శ్రీహరికోటలోని ఇస్రో ప్రయోగ వేదికకు ఆధునికీకరణ పనులు పూర్తి అయ్యాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని నేడు (గురువారం) ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

కేంద్రమంత్రి పర్యటన

ఈ కార్యక్రమానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ స్వయంగా సూళ్లూరుపేటలో హాజరుకానున్నారు. ఈ సందర్బంగా ఇస్రో అధికారులతో సమావేశమై అభివృద్ధి ప్రణాళికలు సమీక్షించే అవకాశముంది.

దేశవాప్తంగా ఆసక్తి

ఇస్రో అభివృద్ధి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు, విద్యార్థులు ఆసక్తిగా గమనిస్తున్నారు. శ్రీహరికోట కేంద్రంగా ఉన్న ప్రయోగ వేదికను పునరుద్ధరించడం ద్వారా మరిన్ని ప్రయోగాలు వేగంగా చేపట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *