పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఐదు లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో కలెక్టర్ ఆదేశాలు

తిరుపతి, కలెక్టరేట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ డా. వెంకటేశ్వర్ అధికారులను ఉద్దేశించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా, ఈ నెల 5న జరగబోయే పర్యావరణ దినోత్సవంను పురస్కరించుకొని, తిరుపతి జిల్లాలో ఐదు లక్షల మొక్కలు నాటాలని, ఇందుకోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

అలాగే, పీ-4 కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేయాలని, ఇందుకు సంబంధిత శాఖల సమన్వయం అవసరమని పేర్కొన్నారు. అదేవిధంగా, జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారులు మరియు రైల్వే ప్రాజెక్టుల భూసేకరణను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను గమనించి, నిర్దేశిత సమయంలోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

 

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *