తిరుపతిలో సైబర్ మోసం ఘటన దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Spread the love

సీబీఐ అధికారులంటూ 32 లక్షల సైబర్ మోసం – తిరుపతిలో విశ్రాంత ఉద్యోగి బలికొల్పు

తిరుపతిలో కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగిని లక్ష్యంగా చేసుకొని సైబర్ మోసగాళ్లు రూ.32 లక్షలు దోచుకున్న ఘటన కలకలం రేపుతోంది. రామచంద్రనగర్ ప్రాంతానికి చెందిన వెంకటరమణ బాబు, లక్ష్మీకుమారి దంపతులు ఈ మోసానికి గురయ్యారు. ఈ నెల 4న సీబీఐ అధికారులమంటూ వారి వాట్సాప్‌కు వీడియో కాల్ వచ్చినది. తరువాత బ్యాంకు ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలను గుర్తించామని, మీ ఖాతాలోకి మరే ఇతర డబ్బులు జమ కాకుండా నిరోధిస్తున్నామని నమ్మబలికారు. దీంతో భయంతో పాటు అధికారిక ధోరణి చూపించడంతో బాధితుడు చెప్పిన ఖాతాలకు మొత్తంగా రూ.32 లక్షలు జమ చేశాడు. ఈ ఘోర మోసం జూన్ 9 నుండి 11 వరకు జరిగినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం తిరుపతి తూర్పు పీఎస్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 సీబీఐ అధికారుల పేరుతో మోసం

 వాట్సాప్ వీడియో కాల్‌తో నమ్మబలికిన ముఠా

 

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *