డీఎస్సీ పరీక్షలు – తిరుపతిలో భద్రతా ఏర్పాట్లు

 జిల్లా కలెక్టర్ సమీక్ష, అధికారులు అలర్ట్

డీఎస్సీ (DSC) పరీక్షల నిర్వహణ కోసం తిరుపతి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించిన సమాచారం ప్రకారం, తిరుపతి జిల్లాలో 8 కేంద్రాల్లో ఈ పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభం కానున్నాయి. అభ్యర్థుల రద్దీ నేపథ్యంలో అన్ని కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

 144 సెక్షన్ అమలు, పోలీస్ పహారా

జిల్లా ఎస్పీ హర్షవర్ధనరాజు ప్రకారం, సెక్షన్ 144 అమలులో ఉంది. అలాగే 30 పోలీస్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు, సీసీ కెమెరా పర్యవేక్షణ, మరియు చెక్కింగ్ విధానంను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు.

 అభ్యర్థులకు సూచన

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కనీసం 15 నిమిషాల ముందు తమ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఆధార్ కార్డు, హాల్ టికెట్ వంటి పత్రాలను మరిచిపోకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *