మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత పూజా రీ ఎంట్రీ
తెలుగు సినీ ప్రియులకు బుట్టబొమ్మగా గుర్తుండిపోయే పూజా హెగ్డే మళ్లీ టాలీవుడ్ను పలకరించబోతున్నారు. 2022లో ‘ఎఫ్3’ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో కనిపించిన తర్వాత ఆమె తెలుగుకు దూరమయ్యారు. అయితే ఇప్పుడు ‘రెట్రో’ అనే డబ్బింగ్ మూవీ ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఎందుకు వచ్చింది గ్యాప్?
తాజా ఇంటర్వ్యూలో పూజా మాట్లాడుతూ, “నేను కావాలనే గ్యాప్ తీసుకోలేదని, మంచి స్క్రిప్ట్స్ కోసం వేచి చూస్తున్నాను. ప్రేక్షకులకు కొత్త పూజాను చూపించాలని అనుకున్నాను. అందుకే కొంత సెలెక్టివ్గా సినిమాలు ఎంపిక చేసుకుంటున్నాను,” అని తెలిపారు.
ఈ గ్యాప్ అనుకోకుండా వచ్చిందని, ఇది తన ప్లాన్లో లేదు అని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒక తెలుగు ప్రాజెక్ట్ను సైన్ చేసినట్టు వెల్లడించారు. “త్వరలోనే అనౌన్స్మెంట్ వస్తుంది. ఇది ఒక లవ్ స్టోరీ,” అని ఆమె తెలిపారు.
‘రెట్రో’లో డిఫరెంట్ రోల్
పూజా ప్రస్తుతం నటిస్తున్న ‘రెట్రో’ అనే డబ్బింగ్ మూవీ గురించి మాట్లాడుతూ, “ఇది కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వ శైలిలో తెరకెక్కిన లవ్ స్టోరీ. ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్గా ఉంటుంది. నా ఫిల్మోగ్రఫీలో ప్రత్యేకంగా నిలిచే సినిమా ఇదే అవుతుందని భావిస్తున్నాను,” అని తెలిపారు.
తెలుగు ప్రేక్షకుల కోసం పూజా ఎంపిక చేసిన ఈ కథ డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉండబోతోంది. ఇది ఆమెకు ఓ మంచి కంబ్యాక్ అవుతుందని అంచనాలు పెరిగాయి.
హిందీ, తమిళ భాషల్లో దూసుకుపోతున్న పూజా
తెలుగు సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్నప్పటికీ, పూజా ఇతర భాషల్లో బిజీగా ఉంది. ఆమె ఇటీవల రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేసింది. అలాగే తమిళ, హిందీ ఇండస్ట్రీలలో వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ను ముందుకు తీసుకెళ్తోంది.